YS - Jagan Mohan Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వైఫల్యాలను ఎవరో ఒకరి మీద నెట్టాలని ఆలోచించి, బిజెపి అయితే ఉపయోగపడవచ్చని భావించి ,బిజెపితో బందం తంచుకున్నారని విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. నిజానికి 2016 జనవరిలో చంద్రబాబు నాయుడు బిజెపి ,కేంద్రం బాగా సాయం చేస్తోందని ప్రకటించారని గుర్తు చేశారు.

ఆ తర్వాత ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి ఒప్పుకున్నారని చెప్పారు.తాము వ్యతిరేకించినా, అసెంబ్లీలో అందుకు కేంద్రానికి దన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారన ఆయన వివరించారు. ఆ తర్వాత ప్రజలలో తనపై ఉన్న వ్యతిరేకతను గుర్తించి , దానిని బిజెపిపై నెట్టి బయటపడాలని భావించి ఆ పార్టీతో బందం తెంచుకున్నారని ఆయన అన్నారు.

దీనిని ప్రజలంతా గమనించారని జగన్ ఒక జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. సరే జగన్ చేసే ఆరోపణ నిజమే అనుకుందాం. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు సాయం చేసిందని ఆయన అనుకుంటారని అన్యాయం చేసింది అనుకుంటున్నారా? జగన్ ఇప్పుడు చేస్తున్న ఆరోపణ కేంద్రం సాయం చేసినా చేయ్యలేదని బీజేపీని దోషిని చేస్తున్నారు చంద్రబాబు అన్నట్టు లేదా?