Is Trivikram taking a risk with Mahesh?

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్.. అతడు, ఖలేజా సినిమాల తరువాత తమ హాట్రిక్ కాంబినేషన్ చిత్రం కోసం పదకొండేళ్ల తర్వాత జట్టు కట్టనున్నారు. మహేష్ బాబు తన ప్రస్తుత సినిమా సర్కారు వారి పాట షూటింగ్ పూర్తయిన తర్వాత ఇప్పుడు # SSMB28 అని పిలువబడే చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది.

సమ్మర్ 2022 లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ముహూర్తం జరుపుకుంటుంది. ఆగష్టులో షూటింగ్ మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ ను ఒక రా ఏజెంట్ గా చూపించనున్నాడట త్రివిక్రమ్.

రా ఏజెంట్ అనగానే పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు త్రివిక్రమ్ గతంలో అతడు, ఖలేజా వంటి కామెడీకి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమాలు చేశారు. ఐతే రా ఏజెంట్ అనేది గనుక నిజమైతే కామెడీ యాంగిల్ తక్కువగా ఉంటుంది. అదే నిజమైతే రిస్క్ అనే చెప్పుకోవాలి.

కాకపోతే మహేష్ లో ఒక కొత్త కోణం ఆవిష్కరించి అవకాశం కలుగుతుంది త్రివిక్రమ్ కు. హారికా మరియు హాసినీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ అని వార్తలు వస్తున్నాయి. అదే గనుక నిజమైతే త్రివిక్రమ్ తన అల వైకుంఠపురంలో టీమ్ నే తిరిగి రిపీట్ చేస్తున్నట్టు అవుతుంది.