ipl-10-punjab-cricket-practicesఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టుతో కింగ్స్ ఎలెవన్ జట్టు తన సొంత గడ్డపై తలపడనుంది. సాయంత్రం 8 గంటలకు ప్రారంభం కాబోయే ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మరో స్థానానికి ఎగపాకాలని పంజాబ్ ఊవ్విళ్ళూరుతోంది. తొలి రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన పంజాబ్, ఆ తర్వాత మూడు మ్యాచ్ లలో వరుస ఓటములను చవిచూసింది. దీంతో ఎలాగైనా ముంబైని కొట్టాలని ఆటగాళ్ళు కూడా కసిగా ప్రాక్టీసు చేసారు.

ఎంత కసిగా అంటే… పైన భానుడు ఓ రేంజ్ లో ప్రతాపం చూపుతుంటే… ప్రాక్టిస్ చేయడం ఆటగాళ్ళ వల్ల కాలేకపోయింది. దీంతో షర్టులు విప్పేసి, టాప్ లెస్ గా భగభగలాడే ఎండలో పంజాబ్ ఆటగాళ్ళు తీవ్రంగా శ్రమించారు. ఇక్కడ వాతావరణం స్వదేశీ ఆటగాళ్ళకు అలవాటే గానీ, విదేశీ ప్లేయర్లు మాత్రం సూర్యుడి రూపాన్ని తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఎండవేడిమికి తట్టుకోలేక, గాలి కోసం చేసిన ఈ ప్రాక్టిస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతగా కష్టపడుతున్నారు కాబట్టి… విజయం మాక్స్ వెల్ సేనదే అవుతుందేమో..!