namburi-satish-balakrishnaహిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆలిండియా కన్వీనర్ నంబూరి సతీష్ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లో ఒక సినీ నిర్మాత ఇంటిపై దాడి చేయగా, అక్కడ కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారం మేరకు హిందూపురంలోని నంబూరి సతీష్ ఇంటిపై కూడా దాడి చేసి దాదాపు 2 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ విషయంపై టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇంత పెద్ద మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక నిర్మాతకు, బాలయ్య అభిమానికి సంబంధమేంటన్న విషయం ఆసక్తికరంగా మారింది. గత కొంత కాలంగా సినీ జనాల ఇళ్ళపై ఐటీ దాడులు ఎక్కువవుతున్నాయని ఈ ఉదంతం బలపరుస్తోంది. ఇటీవలే వారాహి చలనచిత్ర సంస్థ అధినేత సాయి కొర్రపాటిపై ఐటీ శాఖ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజా దాడులకు సంబంధించి మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.