మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్ కంఫర్మ్ చేసారు. సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ `లూసీఫర్` తెలుగు రీమేక్ ఆయన చెయ్యనున్నారు. వచ్చేనెల జనవరి 2021 సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్న ఈ సినిమాతో తమిళ దర్శకుడు `తనిఒరువన్` (ధృవ) ఫేం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు.
మోహన్ రాజా ప్రఖ్యాత ఎడిటర్ మోహన్ వారసుడిగా సుపరిచితం. ఆయన తమిళంలో పాపులర్ డైరెక్టర్. ఐదు తెలుగు సినిమాల్ని తమిళంలోకి రీమేక్ చేసి హిట్ సాధించారు ఆయన. ఫిబ్రవరి-మార్చి – ఏప్రిల్ లో జరిగే షూటింగ్ తో ఈ 153 వ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. కాస్టింగ్ పని కూడా ఒకేసారి జరుగుతోంది. ఈ చిత్రంలో ఇలియానాను హీరోయిన్గా తీసుకోవాలని మేకర్స్ ఆసక్తి చూపుతున్నారని నివేదికలు ఉన్నాయి. 2018లో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంథోనీలో ఇలియానా చివరిసారి కనిపించింది. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తుంది.
ఇలియానా పాత్రకు ప్రాముఖ్యత ఇవ్వడానికి దర్శకుడు స్క్రిప్ట్లో ఏమైనా మార్పులు చేస్తే ఊహాగానాలు కూడా ఉన్నాయి. మరో సీనియర్ హీరోయిన్ పాత్ర కూడా ఈ సినియాలో ఉంటుంది. ఆ పాత్ర కోసం రమ్య కృష్ణ పరిశీలనలో ఉన్నారు. సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించనున్నారు. మిగతా విషయాలు జనవరిలో ప్రకటిస్తారు.