అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు రెండూ ప్రస్తుతానికి జనవరి 12నే విడుదల కాబోతున్నాయి. ఒకే రోజు క్లాష్ అనేది జరుగుతుందో లేదో గానీ సంక్రాంతి బరిలో పోటీ మాత్రం తప్పదు. అయితే ఇప్పటివరకూ విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ కావడంతో ప్రమోషన్స్ లో అల వైకుంఠపురములో చాలా ముందు ఉంది అనే చెప్పుకోవాలి.
అయితే ఇప్పుడు ఆ రేంజ్ పాటలు ఇవ్వాలని దేవి శ్రీ ప్రసాద్ మీద తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పటికే దేవి ఫామ్ లో లేక సతమతం అవుతున్నాడు. పెద్ద స్టార్లు మొహం చాటేస్తున్నారు. రెగ్యులర్ డైరెక్టరైన కొరటాల కూడా ఆయనను వద్దనుకున్నారు. ఈ తరుణంలో ఈ సినిమాతో దేవి తనని తాను ప్రూవ్ చేసుకోవాలి.
దేవి ఏం చేస్తాడు అనేది చూడాలి. సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ ఎప్పుడో విడుదల అయ్యింది. అయితే ఆ పాట అంతంతమాత్రంగానే ఉంది. డిసెంబర్ నుండి సరిలేరు నీకెవ్వరు పాటల ప్రమోషన్ మొదలు అవుతుంది. మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ కేక అంటూ నిర్మాత అనిల్ సుంకర ఇప్పటికే హైప్ పెంచాడు.
ఇది ఇలా ఉండగా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతుంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి దిల్రాజు, అనిల్ సుంకర నిర్మాతలు. అనిల్ ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్2 వంటి అతిపెద్ద హిట్ ఇచ్చారు. దానితో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.