అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ వంగా ఇటీవల తన కొత్త చిత్రం యానిమల్ ని ప్రకటించాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇందులో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రకటన చేస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు. దాని నేపథ్య స్కోరు కు భారీ ఆదరణ లభించింది.
యానిమల్ కోసం సంగీతం చేసేందుకు సందీప్ తన అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రమేశ్వర్ ను బాలీవుడ్ కి తీసుకెళ్తున్నాడని ఇప్పుడు విశ్వసనీయంగా తెలిసింది. ఇది యాక్షన్ నిండిన క్రైమ్ థ్రిల్లర్ అని చెబుతారు. సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.
రణబీర్ కపూర్ తో పాటు, యానిమల్ లో అనిల్ కపూర్, బాబీ డియోల్ మరియు పరిణీతి చోప్రా కూడా నటించనున్నారు. షాహిద్ కపూర్ నటించిన కబీర్ సింగ్ కు పని చేసిన రచయితలు సిద్ధార్థ్ మరియు గారిమా ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తారు. ఈ ప్రాజెక్ట్ యొక్క మరిన్ని వివరాలు తరువాత చెబుతారు. కబీర్ సింగ్ బాలీవుడ్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది.
దాదాపుగా 300 కోట్లు రాబట్టింది. అయితే ఆ సినిమా తరువాత సందీప్ కి బాగా గ్యాప్ వచ్చింది. రణబీర్ తో డెవిల్ అనే సినిమా ప్రకటించిన తరువాత ఆగిపోయింది. ఆ తరువాత సందీప్ తెలుగులో సినిమా చేస్తాడని అన్నారు. అది కూడా జరగకుండా చాలా సమయం గడిచిపోయింది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో సందీప్ అందరిని ఆశ్చర్యపరిచాడు.