మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఘనీ కొంత కాలంగా వివాదాస్పద కారణాల వల్ల వార్తలలో నిలిచింది. ఆ సినిమా హీరో, డైరెక్టర్ కు పడక షూటింగ్ కోసం వేసిన ఒక సెట్ షూట్ చెయ్యకుండానే తీసేశారని ఒక వార్త హల్ చల్ చేసింది. చిత్ర నిర్మాతల మధ్య విబేధాల కారణంగా ఆ సెట్ తీసేశారని ఇంకో వార్త బయటకు వచ్చింది. అయితే రెండు నిజం కాదని దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో కంఫర్మ్ చేశాడు.
తాజాగా ఆ సినిమా గురించి పాజిటివ్ ఒపీనియన్ కోసమా అన్నట్టు నిర్మాతలు ఒక వార్త బయటకు వదిలారు. ఈ చిత్రం లోని ఒక కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ చిత్రం టైటాన్స్, బాలీవుడ్లో సుల్తాన్ వంటి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ పని చేస్తున్నారని ప్రకటించారు.
ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఒక భారీ బాక్సింగ్ రింగ్ సెట్ వేస్తామని కూడా ప్రకటించారు. ఘనీ షూటింగ్ 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కాస్త చక్కబడగానే నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేసి… షూటింగ్ పూర్తి కాగానే రిలీజ్ డేట్కు సంబంధించిన ప్రకటన చేస్తాం అని ప్రకటించారు నిర్మాతలు.
బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.