ఇటీవలే కాలంలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ గా అడ్డాగా మారుతోందని , ఏ రాష్ట్రంలో డ్రగ్స్ పట్టుబడిన దాని మూలాల ఆంధ్రానుండే అంటూ విమర్శలు వస్తున్నాయి.దీనిపై ప్రతిపక్షం నుండి ప్రస్తుత ప్రభుత్వానికి గట్టి విమర్శలు రావడంతో ఏపీ గవర్నమెంట్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
మొన్నీ మధ్య నల్గొండ ఎస్పీ రంగనాథ్ దేశ వ్యాప్తంగా గంజాయి సరఫరా ఏపీ నుండే అంటూ ఓ ఇంటర్వ్యూ చెప్పారు. దాన్ని ఎత్తి చూపిస్తూ టీడీపీ నాయకుడు లోకేష్ గట్టిగా స్పందిస్తూ దీనికి సమాధానం చెప్పాలని కోరారు. అప్పట్లో అది హాట్ టాపిక్ అయింది.
ఇపుడు అదే క్లిప్ ని కాస్త ఎడిట్ చేసి పవన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీని వల్ల ఎంటెయిర్ నేషన్ ఎఫెక్ట్ అవుతుందని వేలెత్తి చూపాడు.
తాము ఎంతో రీ సెర్చ్ చేసి తయారు చేసి పెట్టిన మెటీరియల్ ని పవన్ పవన్ కళ్యాణ్, జెనసేన కార్యకర్తలు అప్పనంగా తీసుకుంటూ ఎడిట్ చేసి వాడుతున్నారని టీడీపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి టీడీపీ రైజ్ చేసిన ఈ టాపిక్ కి ఏపీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు.