grama-volunteers-only-for-ysrcp-membersవైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామవాలంటీర్ల నియామకాలలో కులమతాల పట్టింపులు ఉండవని పదేపదే చెబుతున్నా అవి సొంతవారికి దోచిపెట్టడం కోసమే ప్రవేశపెట్టినవని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. నారా లోకేష్ దీనిని ట్విట్టర్ లో రుజువులతో సహా నిరూపించారు. ఒక కార్యకర్తల సమావేశంలో విజయసాయి రెడ్డి ప్రసంగాన్ని ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ నియామకాలు పార్టీ వారికే అని విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పుకొచ్చారు.

“@ysjagan గారు స్కామ్ స్టార్ అని మరోసారి ఆధారాలతో రుజువైంది. గ్రామ వాలంటీర్ల స్కామ్ తో 12వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి తెరలేపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ వాలంటీర్ల నియామకం అని జగన్ గారు ఆస్కార్ రేంజిలో నటిస్తుంటే, కడుపులో దాచుకోలేక వైకాపా స్కామ్ ని దొంగలెక్కల వీరుడు బయటకి కక్కేశారు. వాలంటీర్ల నియామకంలో కులం, మతం చూడలేదు వైకాపా కార్యకర్తా? కాదా? అని మాత్రమే చూసాం అని స్వయంగా ప్రకటిస్తున్నారు,” అని లోకేష్ ఆరోపించారు.

“నాలుగు లక్షల మంది వైకాపా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి 10 లక్షల మంది ఉద్యోగాలు తీసేసి వారి పొట్ట కొట్టే భారీ కుట్రే వైకాపా వాలంటీర్ల స్కీం,” అని లోకేష్ వ్యాఖ్యానించారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే విజయసాయి రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ఈ ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువత అధికారపక్షం వైఖరితో తీవ్ర నిరాశ చెందారు.