go-back-venkaiah-naidu-rallyకేంద్ర‌మంత్రి వెంక‌య్య‌ నాయుడు విజ‌య‌వాడ‌లోని గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సందర్భంగా… ఆయ‌న‌కు బీజేపీ శ్రేణులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు హోదాతో స‌మాన‌మైన ప్యాకేజీని సాధించిన వెంకయ్య నాయుడును బీజేపీ నేత‌లు స‌న్మానించ‌నున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగ‌ణం వ‌ర‌కు బీజేపీ శ్రేణులు ఘనస్వాగ‌తం ప‌లుకుతూ ర్యాలీ నిర్వ‌హిస్తున్నారు.

మ‌రో వైపు వెంక‌య్య‌కు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హ‌త లేదంటూ వామ‌ప‌క్ష పార్టీల నేత‌లు విజ‌య‌వాడ‌లో ర్యాలీ నిర్వ‌హిస్తున్నారు. ‘వెంక‌య్య గో బ్యాక్…’ అంటూ నినాదాలు చేస్తున్నారు. హోదా సాధించకుండా వెంక‌య్య ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మోసం చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బిజెపి వర్గాలు నిర్వహిస్తున్న అభినంద‌న స‌భకు నిర‌స‌న తెలుపుతున్నారు. ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు త‌లెత్త‌కుండా ప‌లువురు వామ‌ప‌క్ష పార్టీల నేత‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.