Geetha--Govindamఈ నెల 15వ తేదీన విడుదల కాబోతున్న “గీత గోవిందం” సినిమాలో హీరోయిన్ రష్మిక కాకుండా, మరో ఇద్దరు టాప్ హీరోయిన్లు నటించారన్న విషయం ఆడియో వేడుక పైనే బహిర్గతం అయ్యింది. కానీ ఆ ఇద్దరూ ఎవరన్న అంశాన్ని గోప్యంగా ఉంచగా, తాజాగా ఆ ఇద్దరూ ఈ ఇద్దరేనని… ఓ ఇద్దరి టాప్ హీరోయిన్ల పేర్లు హల్చల్ చేస్తున్నాయి.

అందులో ఒకపేరు మరింత ఆశ్చర్యాన్ని కలిగించేది. గ్లామర్ రోల్స్ దూరంగా ఉండే నిత్యామీనన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేసిందని, ఆమె రోల్ ఈ సినిమాను మలుపు తిప్పుతుందన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అలాగే ‘నా పేరు సూర్య’ ఫేం అను ఇమ్మానుయెల్ కూడా మరో కీ రోల్ చేస్తోందని లభించిన సమాచారం.

మామూలుగా ఒక్క హీరోయిన్ ఉంటేనే హీరో విజయ్ దేవరకొండ చెలరేగిపోతాడు. మరి ముగ్గురు ముద్దుగుమ్మలు ఒకే సినిమాలో అంటే… అది “గీత గోవిందం” పట్ల మరింత హైప్ తెచ్చే అంశమేగా! అధికారికంగా ధృవీకరణ కాని ఈ ఇద్దరి హీరోయిన్లకు యూత్ లో మంచి క్రేజ్ అయితే ఉంది. దానికి విజయ్ హంగామా తోడయితే, సిల్వర్ స్క్రీన్ పై రచ్చ రచ్చేనేమో!