Geetha-Govindam-Director-Parasuram-Next-movie“గీత గోవిందం” సక్సెస్ తో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు దర్శకుడు పరశురాం. పదేళ్ళ నుండి ఇండస్ట్రీలో ఉన్నా, లభించని క్రేజ్ ‘గీత గోవిందం’ తర్వాత ఒక్కసారిగా వచ్చి మీద పడడంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్న పరశురామ్, తన తదుపరి సినిమా గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ లోనే ఉంటుందని ఖరారు చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు ఒక సినిమా చేయాల్సి ఉందని, మరికొన్ని డిస్కషన్ స్టేజిలో ఉన్నాయని స్పష్టం చేసారు. ఇక గీతా ఆర్ట్స్ లో చేస్తోన్న సబ్జెక్ట్ ‘మనిషికి – దేవుడికి’ సంబంధించిన కాన్సెప్ట్ అని, పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా ఉండబోతోందని, ప్రస్తుతం దీనిపైనే స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిపారు.

ఈ కాన్సెప్ట్ అంటే ‘గోపాల గోపాల’ చిత్రం గుర్తుకు రావడం సహజమని అన్న పరశురామ్, ఆ సినిమాకు, తమ సినిమాకు ఏ మాత్రం పొంతన లేదని, ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా కధ సిద్ధమైందని చెప్పారు. వచ్చే ఏడాదిలో రానున్న ఈ సినిమాలో హీరో ఎవరన్నది మాత్రం రివీల్ చేయలేదు గానీ, మెగా కాంపౌండ్ నుండే ఓ హీరో చేయబోతున్నారనేది టాలీవుడ్ టాక్.