geetha-govindam-black-ticketing-at-sandhya-theatreహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గల సంధ్య ధియేటర్స్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అగ్ర హీరోల సినిమాలు తప్పకుండా విడుదలయ్యే ఈ ధియేటర్లలో ప్రస్తుతం “గీత గోవిందం” సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీంతో బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపింది ఈ ధియేటర్ యాజమాన్యం.

మల్టీప్లెక్స్ ల పుణ్యమా అంటూ ప్రస్తుతం బ్లాక్ టికెట్ల గోల దాదాపుగా తగ్గిపోగా, ‘గీత గోవిందం’ సినిమాకు వస్తోన్న ప్రేక్షకాధరణ రీత్యా, ఈ సినిమా టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తోందన్న విషయం బట్టబయలైంది. ఆదివారం నాడు సెకండ్ షోకు మఫ్టీలో వచ్చిన చిక్కడ్ పల్లి పోలీసులు, బ్లాక్ టికెట్లు అమ్ముతున్న ఏడుగురిని పట్టుకుని 75 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.

వారిని విచారించగా, ధియేటర్ యజమానులు సుమిత్ సందీప్, మేనేజర్ రామారావు, గీతా ఆర్ట్స్ ప్రతినిధి శంకర్ లతో పాటు సుబ్బమ్మ అనే వారు ఇచ్చారని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. వీరికి టికెట్లు ఇచ్చిన వారంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.