Gavireddi-Ramanaidu Chandrababu Naiduఅనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని జి.కొత్తపల్లిలో ఆదివారం స్థానిక టిడిపి నేతల సమావేశం జరిగింది. మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వైసీపీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లు అనే పేరుతో జీతాలిచ్చి పోషిస్తూ ప్రజాధనాన్నిసొంతానికి వాడుకొంటోంది. కానీ టిడిపి కార్యకర్తలు పార్టీపై అభిమానంతో, స్వర్గీయ ఎన్టీఆర్‌, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడులపై అభిమానంతో పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తుంటారు. ఈ మూడేళ్ళలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పధకాల కోసం రాష్ట్రాభివృద్ధిని విస్మరించింది. అందువల్ల ఈ మూడేళ్ళ జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడి, అప్పులు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయాయి.

ఈ సమస్యలన్నీ తీరాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వారికి బ్రహ్మరధం పడుతుండటం గమనిస్తే ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఎంతగా విసిగిపోయారో అర్దం అవుతోంది. వచ్చే ఎన్నికలలో టిడిపిని గెలిపించుకొనే బాధ్యత మన అందరిపై ఉంది. ముందుగా మనం బూత్ కమిటీలను బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉంది. అప్పుడే వైసీపీని ధీటుగా ఎదుర్కోగలం. అలాగే మండలంలో ప్రతీ వందమందికి ఓ కార్యకర్త చొప్పున ఏర్పడి మనం ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయగలిగితే రాష్ట్రంలో తప్పకుండా టిడిపి అధికారంలోకి వస్తుంది,” అని అన్నారు.

మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఈ సమావేశంలో టిడిపి మండల అధ్యక్షుడు పోతల చిన్నం నాయుడు, స్థానిక టిడిపి నాయకులు కొల్లి సూరినాయుడు, కొల్లి పైడంనాయుడు, పైల ముత్యాల నాయుడు, జి.గణేశ్, బీళ్ళ కోటేశ్వర రావు, గండి ముసలినాయుడు, పోతల చిన్నం నాయుడు, బండారు దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

image.png