Gautamiputra Satakarni Latest News - Court Noticesనందమూరి నటసింహం బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బాలయ్యతో పాటు “గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి” సినిమాలను నిర్మించిన నిర్మాతలకు కూడా నోటీసులు ఇచ్చింది. ఈ రెండు సినిమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినోదపు పన్ను నుంచి మినహాయింపును ఇవ్వగా, కేవలం ‘శాతకర్ణి’ సినిమాకు మాత్రమే ఏపీ ప్రభుత్వం పన్నును మినహాయించింది.

ఈ నేపథ్యంలో, వినోదపు పన్ను మినహాయింపును ప్రేక్షకులకు మాత్రమే చెందేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తన పిటిషన్ లో గతంలో తమిళనాడుకు సంబంధించిన ఓ తీర్పును పిటిషనర్ ప్రస్తావించారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు బాలయ్యతో పాటు శాతకర్ణి, రుద్రమదేవి చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసి, సదరు నోటీసులకు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.