gali-janardhan-reddy-wedding-cost-expense-talkమైనింగ్ మాఫియాతో ఇళ్ళంతా బంగారుమయం చేసుకున్న గాలి జనార్ధన్ రెడ్డి గురించి తెలియని వారుండరని చెప్పడంలో సందేహం లేదు. ఒకప్పుడు ఎన్నో కేసులతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుమ్రోగిన గాలి జనార్ధన్ రెడ్డి పేరు మళ్ళీ ‘టాక్ ఆఫ్ ఇండియా’గా మారాలని ఆశిస్తున్నారట. అయితే ఈ సారి కేసులతో కాదు, తన కూతురి వివాహ మహోత్సవంతో టాక్ ఆఫ్ నేషన్ గా నిలవాలని సన్నాహాలు చేస్తున్నారట.

హైదరాబాద్ కు చెందిన పారిశ్రామిక వేత్త కొడుకుతో గాలి తనయురాలి నిశ్చయ తాంబూలం అయిన విషయం తెలిసిందే. నవంబర్ లో జరగనున్న ఈ వివాహం దక్షిణాదిలో అత్యంత ఖరీదైన పెళ్లిగా నమోదు కావాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆకాశమే క్రిందికి దిగివచ్చిందా అనే రీతిలో జరగాలని భావిస్తున్న గాలి, ఈ వేడుకలో ప్రముఖ టాప్ హీరో హీరోయిన్లంతా చిందులేసి సందడి చేయాలని తెరవెనుక కధలు నడుపుతున్నట్లుగా సమాచారం.

ఇప్పటికే బాలీవుడ్ టాప్ స్టార్ షారుక్ ఖాన్ మరియు టాప్ బ్యూటీ కత్రీనా కైఫ్ లు పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి అంగీకారం తెలిపారని, అలాగే తమన్నా, ప్రభుదేవాల విషయం ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని, పారితోషికం విషయంలో ఎంత కావాలంటే అంత ఇస్తానని, సినీ నటుల చిందులు మాత్రం తప్పనిసరి అంటూ ప్రముఖుల తలుపులు తడుతున్నట్లుగా సమాచారం. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రధాన నేతలంతా ఈ వివాహానికి విచ్చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.