Allu- Arjun - Trivikram Srinivas-నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో రూపొందిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా పై తరచూ నెగటివ్ వార్తలు రావడం గమనార్హం. మొన్న ఆ మధ్య అల్లు అర్జున్ ఈ సినిమా లొకేషన్ లో ఒక అస్సిస్టెంట్ డైరెక్టర్ తో గొడవ పడ్డాడని వార్తలు వచ్చాయి.

ఈరోజు ఒక ఇంగ్లీష్ పత్రిక ఈ సినిమా ను మహేష్ బాబు డిజాస్టర్ సినిమా బ్రహ్మోత్సవంతో పోలుస్తూ ఒక ఆర్టికల్ ప్రచురించింది. సినిమా ఇంకా నలభైశాతం కూడా పూర్తి కాకుండానే విషప్రచారం చెయ్యడం మొదలు పెట్టింది. అదే ఆర్టికల్ లో బన్నీకి ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ పోయిందని కూడా రాసేశారు. ఈ ఆర్టికల్ చదివితే ఉద్దేశపూర్వకంగా బన్నీ మీద ఈ సినిమా మీద విషప్రచారం చెయ్యడం కోసమే రాసినట్టు ఉందని ఎవరో బన్నీ మీద పగబట్టారని మెగా అభిమానులు ఆరోపిస్తున్నారు.

అయితే అది ఎవరు అనేది అసలు ప్రశ్న? మరోవైపు జరుగుతున్న పరిణామాలపై బన్నీ గానీ చిత్రబృందం గానీ ఇప్పటిదాకా స్పందించలేదు. ఇంకా పేరు పెట్టని ఆ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందు దాదాపుగా 100 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బన్నీ కోసం వేణు శ్రీరామ్, సుకుమార్ లాంటి దర్శకులు బన్నీ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.