కత్తి మహేష్ నగర బహిష్కరణ తరువాత ఓ వర్గాన్ని రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారన్న ఆరోపణలతో పరిపూర్ణానందస్వామిని హైదరాబాద్ నుంచి బహిష్కరించారు తెలంగాణ పోలీసులు. స్వామీజీని ఆశ్వారావుపేట మీదుగా కాకినాడలోని శ్రీపీఠంనకు తరలించారు. స్వామీజీ ఆరునెలల తర్వాత హైదరాబాద్ లో ప్రవేశించడంపై కూడా ఆంక్షలు కూడిన అనుమతులు ఇవ్వబోతున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు అనుమతితోనే హైదరాబాద్ లో అడుగుపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే స్వామిజీ కంటే దారుణంగా మాట్లాడిన ఎంఐఎం నాయకులను నగర బహిష్కరణ చేసే ప్రయత్నం ఎప్పుడన్నా చేశారా? హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం అనేక సార్లు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై ఎప్పుడన్నా బహిష్కరణ వేటు వేశారా?
వాళ్ళంటే రాజకీయ నాయకులు కాబట్టి వారి జోలికి వెళ్ళే ధైర్యం హైదరాబాద్ పోలీసుగానీ, తెలంగాణ ప్రభుత్వంగానీ చెయ్యడం లేదా? ఏదైనా విషయం వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా నిముషాలలో దేశాలు దాటే ఈ రోజుల్లో నగర బహిష్కరణతో ఒక మనిషిని కట్టడి చెయ్యగలరా? ఈ కనీసం విషయం తెలంగాణ పోలీసులకు తెలీదా?