Director Vikram Kumar Approached Siddharth for Manam Movie‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ టైంలో తెలుగు, తమిళ భాషల్లో సిద్ధార్థ్ కి మంచి క్రేజ్ వుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ రెండు భాషల్లోను ఆయనకి అవకాశాలు తగ్గాయి. దాంతో ఈ రెండు భాషల్లోను తనే నిర్మాతగా .. హీరోగా ఆయన ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఆ మధ్య తెలుగులో వచ్చిన ‘మనం’ సినిమాను గురించి సిద్దూ ప్రస్తావించాడు.

ఈ కథ కోసం దర్శకుడు విక్రమ్ కుమార్ ముందుగా తననీ, కె. విశ్వనాథ్ ను, వెంకటేశ్ ను అనుకున్నారని చెప్పాడు. అయితే ఆ తరువాత ఆయన ఈ కథను అక్కినేని ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్లారని, అందువలన ఈ సినిమాలో తాను చేయవలసిన పాత్రను మిస్సయ్యానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా వచ్చిన చాలాకాలం తరువాత సిద్ధార్థ్ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించడమే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.