సినిమా షూటింగులు ప్రారంభం కావడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక సానుకూల సంకేతం కోసం ఎదురుచూస్తోంది, అయితే బ్యాక్ టు బ్యాక్ చెడు వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం, ఎస్ఎస్ రాజమౌళి తాను మరియు తన కుటుంబం కరోనా పాజిటివ్ గా తేలినట్టు ట్విట్టర్ లో ప్రకటించారు.
ఇప్పుడు, డైరెక్టర్ తేజ కూడా ప్రమాదకరమైన వైరస్ బారిన పడ్డారు. తేజ ఇటీవలే తన తొలి వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభించాడు. వెబ్ సిరీస్ కు సంబంధించిన మొదటి ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి చేశారు. షూటింగ్ సమయంలో అతను వ్యాధి బారిన పడి ఉండొచ్చని పుకార్లు ఉన్నాయి.
దీంతో ఆయనతో పని చేసిన యూనిట్ సబ్యులకు, అలాగే కుటుంబ సభ్యులకు కారోనా టెస్టులు చేశారు వైద్యులు. ఈ రిపోర్టుల్లో తేజకు తప్ప మిగతావారందరికీ నెగిటివ్ వచ్చింది. కాగా ప్రస్తుతం తేజ హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.
ఒక చిన్న వెబ్ సిరీస్లో ఇదే జరిగితే, సమీప భవిష్యత్తులో పెద్ద చిత్రాల షూటింగులను తిరిగి ప్రారంభించడం చాలా కష్టం. ఇప్పటి పరిస్థితులను బట్టి కరోనా కేసులు కనీసం అక్టోబర్ నాటికి తగ్గుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా వారు షూటింగులను ప్రారంభించి, వేసవికి విడుదల కావాల్సిన సినిమాలు కనీసం సంక్రాంతి 2021 విడుదలకు సిద్ధం చెయ్యాలని భావిస్తున్నారు.