Director Surender Reddy next with mahesh babuప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘సైరా’ సినిమాను తెరకేక్కిస్తున్నాడు సురేందర్ రెడ్డి. ఈ సినిమా తరువాత ఆయన బన్నీతో గానీ, మహేశ్ బాబుతో గాని చేయవచ్చనే టాక్ వినిపించింది. ఈ ఇద్దరిలో కూడా మహేష్ బాబుతోనే ఆయన ముందుగా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తాజా సమాచారం. మహేశ్ బాబు కోసం ఓ విభిన్నమైన ఒక కథను సిద్ధం చేశాడట.

ప్రస్తుతం వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు సినిమా చేస్తున్నాడు. డెహ్రాడూన్ లో ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత మహేశ్ బాబును కలిసి కథను వినిపించే పనిలో సురేందర్ రెడ్డి వున్నాడని టాక్. గతంలో సురేందర్ రెడ్డి .. మహేశ్ బాబు కాంబినేషన్లో ‘అతిథి’ సినిమా అభిమానులకు నిరాశనే మిగిల్చింది. అందువలన ఈ సారి మహేశ్ ఫ్యాన్స్ మెచ్చేలా కథను రెడీ చేసుకున్నాడట.