Director Sandeep Reddy Vangaటాలీవుడ్ లో సెన్సషనల్ హిట్ అందించిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో కూడా అదే సబ్జెక్టుతో కబీర్ సింగ్ పేరు భారీ హిట్ కొట్టాడు. ఆ తరువాత నుండి ఆయన తరువాతి ప్రాజెక్టు చర్చ నడుస్తూ ఉంది. బాలీవుడ్ లో సందీప్ కు అవకాశాలు వస్తుండడంతో అక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తున్నాడు. తన తరువాతి సినిమా కూడా అక్కడే చేయాలనీ డిసైడ్ అయ్యాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ కు ఆయన ఒక స్క్రిప్టు వినిపించి ఒప్పించాడట.

ఇది ఒక క్రైమ్ డ్రామా అని సమాచారం వస్తుంది. ఆద్యంతం గ్రిప్పింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించబోతున్నారట. అయితే ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదట. రణబీర్ సింగ్ చేతిలో ఇప్పటికే బ్రహ్మాస్త్ర, శంషేరా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ రెండూ పూర్తి అయ్యాకే సందీప్ వంగా ప్రాజెక్టు తెరమీదకు వెళ్తుంది. దీనితో సాలిడ్ స్క్రిప్టు తయారు చెయ్యడానికి కావాల్సిన టైం సందీప్ వంగాకు దొరుకుతుంది.

దీనిని బట్టి చూస్తే ఇప్పట్లో ఆయనకు టాలీవుడ్ సినిమాలు చేసే సమయం దొరికేలా లేదు. సందీప్.. సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తన వద్ద ఉన్న కథ గురించి సందీప్.. మహేశ్‌కు వినిపించారని ఆయనకు స్క్రిప్ట్ నచ్చడంతో ఓకే చేశారని గతంలో వదంతులు వినిపించాయి. అన్నీ అనుకున్నట్లు కుదిరితే సినిమాను 2020లో సెట్స్ మీదకు తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అనుమానమే.