Director Parasuram next with Naga chaitanyaదర్శకుడు పరశురామ్ అనూహ్యంగా విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల షేర్ రాబట్టింది. అయితే ఆ సినిమా తరువాత తన తదుపరి చిత్రం కోసం పరశురామ్ ఏడాదికి పైగా వేచి చూడాల్సి వచ్చింది. మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్స్ ను కలిసి స్క్రిప్ట్ చెప్పినా పని అవ్వలేదు.

ఫైనల్ గా నాగచైతన్య తో ఆయన కొత్త సినిమా ప్రకటించారు. ఈ సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. నాగ చైతన్య 20 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు అతి త్వరలో తెలియజేయనున్నారు.

ఈ నిర్మాతలు తమ చివరి సినిమా గద్దలకొండ గణేష్ తో యావరేజ్ అందుకున్నారు. మరోవైపు నాగ చైతన్య మజిలీ వంటి హిట్ తో ఊపు మీద ఉన్నాడు. ఆయన వెంకటేష్ తో నటించిన మల్టీస్టారర్ చిత్రం వెంకీమామ నిన్న విడుదల అయ్యింది. ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం స్ట్రాంగ్ గానే ఉన్నాయి.

సోమవారం నుండి ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని వేసవికి విడుదల చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు పరశురామ్ చిత్రం ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి.