Director Nag Ashwin - Prabhasయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్‌తో జతకట్టనున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ కరోనా వైరస్ పాండమిక్ కారణంగా అది జరగలేదు. ఈ సినిమా ఇప్పుడు వచ్చే ఏడాదికి నెట్టబడింది.

“ప్రభాస్ సార్‌తో చిత్రం కోసం నేను 2007 లో రాసిన నా మొదటి స్క్రిప్ట్ ఇది. గత 10 సంవత్సరాల్లో స్క్రిప్ట్ చాలా మారిపోయింది. నేను ముఖ్యంగా ఈ చిత్రానికి విఎఫ్‌ఎక్స్ నేర్చుకున్నాను. అసలు ఈ కథ వల్లనే నేను దర్శకుడిగా అవ్వాలనుకున్నా” అని నాగ్ అశ్విన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఈ చిత్రం ఫాంటసీతో కూడిన సైన్స్ ఫిక్షన్ చిత్రం అని వదంతులు వినిపిస్తున్నాయి. సీనియర్ నిర్మాత, నాగ్ అశ్విన్ మామగారు అశ్విని దత్ తన వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ మూవీకి 500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, పాన్-ఇండియా విడుదల అవుతుందని నివేదికలు ఉన్నాయి.

ప్రభాస్ ఈ నెలలోనే తన రాధే శ్యామ్ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నాడు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలోనే నాగ్ అశ్విన్ సినిమా తెరకెక్కవచ్చు. ఏడాది లో షూటింగ్ పూర్తి చేసి విడుదల చెయ్యాలని నిర్మాతల ప్లాన్ గా ఉంది.