mahesh-babu_rakul-preet-singhతెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న మురుగదాస్ – మహేష్ బాబుల సినిమాపై తాజాగా టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా హీరోయిన్ రకుల్ తో పాటు, ఓ ప్రత్యేక పాత్రలో నయనతారను కూడా దర్శకుడు ఎంపిక చేసారని, అలాగే దీనికి నయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని పుకార్లు షికారు చేసాయి. వీరిద్దరి కాంభినేషన్ లో గతంలో ‘గజని’ సినిమా ఉండడం, ఈ పుకార్లకు మరింత బలాన్నిచ్చాయి. తాజాగా దీనిపై మురుగదాస్ సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చేసారు.

‘మహేష్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కరే ఫీమేల్ లీడ్ గా చేస్తున్నారని’ చెప్తూ పుకార్లకు చెక్ పెట్టారు. దీంతో నయనపై వచ్చినదంతా గాసిప్ మాత్రమేనని తేటతెల్లమైంది. ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నెల 22వ తేదీ వరకు చెన్నైలో షెడ్యూల్ ముగిసిన తర్వాత మలి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్రారంభించనున్నారు. ఇటీవలే సూపర్ సక్సెస్ అయిన ‘జ్యో అచ్యుతానంద’ సినిమా సెట్ లో మహేష్ చిత్రం షూటింగ్ జరుపుకోబోతుందన్న వార్త కూడా హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే.