Director Krish ready with another script for mahesh babu“గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా సక్సెస్ తో ‘టాక్ ఆఫ్ టాలీవుడ్’గా దర్శకుడు క్రిష్ పేరు మారుమ్రోగుతోంది. ప్రస్తుతం ఏ నోట విన్నా క్రిష్ పేరే, ఏ మాట అంటున్నా క్రిష్ గురించే… అనేటంతగా ప్రభావం చూపుతున్నాడు. అలాంటి క్రిష్ దర్శకత్వంలో ఒకప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా “శివం” అనే సినిమా రాబోతుందన్న ప్రచారం జరిగింది. స్వయంగా క్రిష్ ఈ విషయాన్ని ధృవపరచగా, రాజమౌళి సైతం, ‘ఈ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని, మహేష్ కెరీర్ లో మరో ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందని’ కొనియాడారు.

మరి ఆ స్క్రిప్ట్ ఏమైంది? ఆ కధ ఏమైంది? అసలు క్రిష్ – ప్రిన్స్ కాంభినేషన్ లో సినిమా ఏమైంది? వీటన్నింటికి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్రిష్ జవాబు చెప్పారు. అప్పట్లో సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమేనని, మొత్తం ప్లాన్ కూడా చేసుకున్నామని, ఈ లోపున మహేష్ ‘ఆగడు’ సినిమా పూర్తి చేస్తానని, ఆ తర్వాత చేద్దామని అనుకున్నామని, అలాగే హిందీలో ‘గబ్బర్’ గురించి అడుగుతున్నపుడు, మహేష్ – నమ్రతలే తన పేరును సంజయ్ లీలా భన్సాలికి చెప్పారని క్రిష్ స్పష్టం చేసారు.

అయితే అది పూర్తి చేసి రావడానికి తనకు రెండేళ్ళ సమయం పట్టిందని, ఆ తర్వాత ‘కంచె’ సినిమా చేయడం, ఇంతలో ‘శ్రీమంతుడు’ ట్రాక్ లోకి మహేష్ వెళ్ళడంతో, అప్పుడు అనుకున్న కధను పక్కన పెట్టేసానని, మహేష్ కోసం మరో స్క్రిప్ట్ ను అనుకుంటున్నానని, మహేష్ తో ఖచ్చితంగా ఓ సినిమా చేయాలని ఉందని తన అనుభూతులను, “శివం” సినిమా స్క్రిప్ట్ ‘మిస్టరీ’ని బయటపెట్టారు క్రిష్. దీంతో క్రిష్ సినిమాపై ప్రిన్స్ ఫ్యాన్స్ కు కాస్త క్లారిటీ వచ్చినట్లయ్యింది.