Dileep offered Rs 3 crore to Pulsar Suni for abducting  actress bhavanaసినీ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన హీరోయిన్ భావన కేసు ఓ కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంలో ప్రముఖ మలయాళ హీరో దిలీప్ మరియు ఆమె భార్య కం హీరోయిన్ అయిన కావ్య మాధవన్ లు కీలక సూత్రధారులుగా తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తేలిన హీరో దిలీప్ ఇప్పటికీ నాలుగు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించగా, ప్రతి సారి కోర్టు తిరస్కరణకు గురవుతూ వస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఘటన వెనుక ఉన్న ‘సెటిల్మెంట్’ను పోలీసులు తాజాగా వివరించారు.

దాదాపుగా 3 కోట్ల రూపాయలను సుపారీ రూపంలో హీరో దిలీప్ ఒప్పందం చేసుకున్నట్లుగా కేరళ పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రాసిక్యూషన్ సందర్భంగా కేరళ హైకోర్టుకు పోలీసులు తెలిపారు. భావనను అపహరించేందుకు సుపారీ 1.50 కోట్ల రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారని, పోలీసులకు పట్టుబడితే 3 కోట్ల రూపాయల సుపారీ ఇస్తానని పల్సర్ సునీతో నటుడు దిలీప్ ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం దిలీప్ తో పాటు పల్సర్ సునీ కూడా పోలీసుల అదుపులోనే ఉన్న విషయం తెలిసిందే.