సీనియర్ నిర్మాత, పంపిణీదారుడు, దిల్ రాజు సాహూ నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇచ్చారట. ఆ సినిమాకు సంబంధించిన నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాల హక్కుల కోసం 45 కోట్ల ఆఫర్ ఇచ్చారట. తొందరలోనే అగ్రీమెంట్లు కూడా జరగబోతున్నాయి. దిల్ రాజు చేతిలో పడిందంటే సాహోకు భారీ రిలీజ్ ఖాయమనే చెప్పుకోవాలి. మరోవైపు చిత్ర షూటింగు ముగింపు దిశగా సాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సినిమా షూటింగు జరుగుతుంది.
సాహూ మ్యూజిక్ డైరెక్టర్లు తప్పుకోవడంతో కొత్త వారు వచ్చి రెండు పాటలు రెడీ చెయ్యాలి. ఆ రెండు పాటలు షూట్ చెయ్యాలి. వారికి రీప్లేస్మెంట్ గా అనేక పేర్లు విపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ చిత్ర నిర్మాతలు ఎవరినీ ధృవీకరించలేదు. ఆగస్టు 15 వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు మేకర్స్. బాలీవుడ్ శ్రద్దా కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అరంగేట్రం చేస్తుంది. ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్ విలన్గా నటిస్తున్నాడు.
రంజాన్ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల అవుతుందని వార్తలు వచ్చినా అది జరగలేదు. అయితే బెస్టు అవుట్ ఫుట్ తో రావడానికే ఈ ఆలస్యమని చిత్ర యూనిట్ అంటుంది. టీజర్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా బాహుబలి సక్సెస్ తో అందరికీ సుపరిచితమైన ప్రభాస్ ఈ సినిమా పెద్ద హిట్ అయితే దేశవ్యాప్తంగా పెద్ద స్టార్ అయిపోవడం ఖాయమే.