Pawan Kalyan - Chiranjeevi
కరోనావైరస్ వ్యాప్తి మొత్తం తెలుగు చలన చిత్ర పరిశ్రమని ఎక్కడిది అక్కడ ఆగిపోయేలా చేసింది. ఈ క్రమంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ చిత్రం వకీల్ సాబ్ కూడా దాని నిర్మాణాన్ని నిలిపివేసింది. ఆ చిత్రంమే 15 విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు అది జరిగేలా కనిపించడం లేదు.

షూటింగ్‌లు తిరిగి ప్రారంభమైన తర్వాత చిత్ర బృందం పవన్‌ కళ్యాణ్‌తో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంటుంది. దీనితో నిర్మాత దిల్ రాజు కొత్త తేదీ కోసం చూస్తున్నారని సమాచారం. ఈ సినిమా దీర్ఘకాలం వాయిదా వేయవచ్చని అంటున్నారు. చిరంజీవి ఆచార్య వాయిదా పడుతున్నారనే పుకార్లతో, దిల్ రాజు ఆ తేదీకి వకీల్ సాబ్ ని తీసుకుని రావడానికి ఆసక్తిగా ఉన్నారు.

ప్రణాళిక ప్రకారం అంతా జరిగితే, ఆగస్టు 14 న స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్‌గా వకీల్ సాబ్ వెలుగు చూస్తుంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ యొక్క అధికారిక తెలుగు రీమేకైన ఈ సినిమాకు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శృతి హాసన్ హీరోయిన్ గా కంఫర్మ్ అయ్యిందని వార్తలు వస్తున్నా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. పింక్ లో అమితాబ్ బచ్చన్ ఒక ముసలి లాయర్ గా కనిపిస్తారు. ఆయన ఆరోగ్యం బాలేని సతీమణిని చూసుకుంటూ ఉండే పాత్రలో కనిపిస్తారు. అయితే ఈ మొత్తం ఘట్టం సినిమాలో మార్చేశారట. పవన్ కళ్యాణ్ కోసం మాస్ బ్లాక్ ఒకటి పెట్టి, ఒక ఫైట్ కోసం పెట్టారట.