జెర్సీ రీమేక్ తో బాలీవుడ్లోకి అడుగుపెడుతున్న సీనియర్ నిర్మాత దిల్ రాజు హిందీలో తన రెండవ ప్రాజెక్ట్ను ప్రకటించారు. ఇది కూడా రీమేక్ ప్రాజెక్ట్ కావడం విశేషం. తెలుగు హిట్ చిత్రం ‘హిట్’ యొక్క అధికారిక రీమేక్ కానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రాజ్కుమార్ రావ్ నటించనున్నారు.
ఒరిజినల్కు దర్శకత్వం వహించిన సైలేష్ కొలను ఈ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ ప్రకటన ద్వారా దిల్ రాజు ఎటువంటి రిస్క్ తీసుకోవటానికి ఆసక్తి చూపడం లేదని అర్ధం అవుతుంది. బాలీవుడ్లో టాలీవుడ్ లో హిట్టయిన సబ్జెక్టులను మాత్రమే సినిమాలుగా తీస్తున్నట్టుగా కనిపిస్తోంది. కరోనా భయం తగ్గిన తరువాత ఇది 2021 లో సెట్స్ లోకి వెళ్తుంది.
గత కొన్ని రోజుల నుండి, దిల్ రాజు తన వీ మరియు వకీల్ సాబ్ సినిమాలు విడుదలయ్యే వరకు మరిన్ని ప్రాజెక్టులను చేపట్టరని వార్తలు వచ్చాయి. కానీ దిల్ రాజు అది తప్పు అని నిరూపించారు. ఈ సినిమా యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులు చురుకైన వేగంతో జరుగుతున్నాయి మరియు ఒరిజినల్లోని లోపాలను పరిష్కరించడానికి యువ దర్శకుడికి తగినంత సమయం ఉంటుంది.
హిట్..హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్లో పనిచేసే ఓ పోలీస్ ఆఫీసర్ అనుమానాస్పదంగా మిస్ అవుతున్న అమ్మాయిల గురించి అన్వేషిస్తుంటాడు. ఈ కేసులను ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదిస్తాడు? అనేదే సినిమా కథాంశం. టాలీవుడ్ లోని స్ట్రెయిట్ సినిమాలలో ఈ ఏడాది వచ్చిన చివరి హిట్ ఈ సినిమా. ఆ తరువాత కరోనా కారణంగా ఇండస్ట్రీ మూతపడింది.