Dil raju arranges AC floor for Pawan Kalyanజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన కమ్ బ్యాక్ గురించి పెదవి విప్పలేదు. “నాకు తెలిసింది సినిమా ఒక్కటే. చేస్తానో లేదో తెలీదు కానీ ప్రొడక్షన్ మాత్రం చేస్తాను, అంటూ నిన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. మరోవైపు పవన్ కళ్యాణ్ బాలీవుడ్ హిట్ సినిమా పింక్ రీమేక్ చెయ్యడానికి సిద్ధం అవుతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈ చిత్రం కోసం దిల్ రాజు అన్నపూర్ణ సెవెన్ యాకర్స్ స్టూడియోలో ఒక ఫ్లోర్ బుక్ చేశారట. ఇది పూర్తిగా ఏసీ ఫ్లోర్ అని సమాచారం. తొందరలోనే అక్కడ కోర్టు సెట్ నిర్మాణం మొదలు పెడతారట. చిత్రం సగంపైగా ఇక్కడే షూటింగ్ జరుపుకుంటుంది. పింక్ లో అమితాబ్ బచ్చన్ ఒక వృద్ధ లాయర్ గా కనిపిస్తారు. ఆ పాత్ర పవన్ కళ్యాణ్ చెయ్యబోతున్నారు కాబట్టి ఆయన ఇమేజ్ ఆధారంగా కొన్ని మార్పులు చెయ్యబోతున్నారట.

త్రివిక్రమ్ పర్యవేక్షణలో స్క్రిప్ట్ మార్పులు జరుగుతాయని కూడా అంటున్నారు. నానితో ఎం సి ఏ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోగా, బోనీ కపూర్ సహా నిర్మాతగా ఉండబోతున్నారు. మొన్న ఆ మధ్య సినిమా తమిళంలో తీసి హిట్ కొట్టాడు బోనీ కపూర్.

ఇంతకీ ఈ పింక్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్‌తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ.