dil rajuసంక్రాంతికి ‘భీమ్లా నాయక్’ రిలీజ్ ఫిక్స్ కావడంతో, ఏర్పడే ధియేటర్ల కొరత దృష్ట్యా మూడు పెద్ద సినిమాలకు అవకాశం ఉండదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రెండు పాన్ ఇండియా సినిమాలు కావడంతో పవర్ స్టార్ ‘భీమ్లా నాయక్’ రిలీజ్ ఆ రెండు పెద్ద సినిమాలకు తలనొప్పిగా మారింది.

ఈ సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకు ‘దిల్’ రాజు రంగంలోకి దిగారు. రాజు గారి నేతృత్వంలోని ‘యాక్టీవ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్’ పవన్ సినిమా రిలీజ్ డేట్ మార్చాల్సిందిగా చర్చలు జరపడానికి సిద్ధమయ్యారు. ‘భీమ్లా నాయక్’ విడుదల అనేది ఆ రెండు పెద్ద సినిమాలకే కాకుండా, ధియేటర్ల కొరత వలన పవన్ సినిమా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

టాలీవుడ్ ‘ఏస్’ ప్రొడ్యూసర్ గా ప్రస్తుతం ఇండస్ట్రీలో చలామణి అవుతోన్న రాజు గారు రంగంలోకి దిగారంటే కధ సుఖాంతం అవుతుందనే ఆశాభావంతో సినీ వర్గాలు ఉన్నాయి. మరి పవర్ స్టార్ ‘క్లైమాక్స్’ ట్విస్ట్ లు ఏమైనా ఇస్తారేమో చూడాలి.