Did Pawan Kalyan fed up with BJP went to quarantineజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. పవన్ వ్యక్తిగత సిబ్బంది, ముఖ్య కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బందిలో పలువురు కరోనా బారిన పడటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా, డాక్టర్ల సూచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయా సిబ్బంది తమ రోజూ వారీ విధులలో భాగంగా పవన్ కళ్యాణ్ కు చాలా దగ్గరగా ఉంటారట. దానితో పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడ్డారట.

ఈ మేరకు జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. క్వారంటైన్ నుంచే రోజూవారీ విధులను, పార్టీ కార్యక్రమాలను పరిశీలించనున్నారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడనున్నారని ప్రకటనలో తెలిపారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. రేపు తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో కలిసి తిరుపతి లో ఒక రోడ్ షోలో పాల్గొనాల్సి ఉంది.

ఈ రోడ్ షోకు వెళ్లకూడదనే పవన్ క్వారంటైన్‌లోకి వెళ్లారు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వేధిస్తోంది. జగన్ రిమోట్ కంట్రోల్ బీజేపీ అధినాయకత్వం చేతిలో ఉన్న మాట అందరికీ తెలిసిందే. ఈ తమాషా ఆపండి అని ఢిల్లీ నుండి ఒక్క ఫోన్ వస్తే అంతా సర్దుకునేది. అయితే బీజేపీ ఏదో నమమాత్రంగా ఖండించడం తోనే సరి పెట్టారు. పవన్ ని వాడుకుని కనీసం స్పందించలేదు అనే కోపంతోనే పవన్ ఇలా చేశారని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.