Daggubati Purandeswari2019 నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తిచేయాలని కేంద్రం దృఢ సంకల్పంతో ఉండగా.. ఇక్కడ తప్పుడు ప్రచారం జరుగుతోంది అని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ ఇంఛార్జి దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. పోలవరం ఆనకట్ట నిర్మాణంలో కేంద్రంపై బురద చల్లొద్దు ఆమె తెలుగుదేశం ప్రభుత్వానికి హితవు పలికారు.

పోలవరం నిర్మాణాలకు పెంచిన అంచనాలకు అనుగుణంగా శాస్త్రీయ అధారాలను కేంద్రానికి నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు ఆమె. పైగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వెళ్లే బృందంలో భాజపా తరఫున తమకూ స్థానం కల్పించాలని సూచించారు.

కేంద్రం రాష్ట్రం మధ్య చర్చలు రాజ్యాంగ పరిధిలో జరుగుతాయి. మరి ఆ చర్చల్లో భాజపా తరపున తమకు స్థానం కలిపించాలని ఆవిడ ఎలా అడగగలరు? పురందేశ్వరి రాజ్యాంగేతర శక్తిగా మారాలనుకుంటున్నారా? ఒకప్పుడు కేంద్ర మంత్రిగా పని చేసి, అప్పటి ప్రధానితో కీర్తించపడిన పురందేశ్వరికి ఇవన్నీ తెలియవా?