Coronavirus - positvieకరోనా వైరస్ బారినపడిన తాజా తెలుగు చిత్ర ప్రముఖుడు సీనియర్ నటుడు రాజశేఖర్ అని నివేదికలు వెలువడుతున్నాయి. స్వయంగా డాక్టర్ అయిన ఈ నటుడు త్వరలో నీలకంఠ దర్శకత్వంలో తన కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభించే ప్రయత్నాలలో ఉండగా ఇది జరగడం గమనార్హం.

షూటింగ్ ప్రారంభ తేదీకి కొన్ని రోజుల ముందు, నటుడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్నారట. ఆయన సతీమణి జీవిత కూడా పాజిటివ్‌గా పరీక్షించబడ్డారని మనకున్నా సమాచారం. రాజశేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, జీవిత హోమ్ క్వారంటైన్ లో ఉన్నారట ఇద్దరి పరిస్థితి స్థిరంగా ఉండి రికవర్ అవుతున్నారట.

వారం ముందే వారు పాజిటివ్ గా తేలగా ఈ వార్త ఇప్పుడే బయటకు వచ్చింది. అయితే వారి కుమార్తెల – శివానీ మరియు శివత్మిక గురించి ఎటువంటి సమాచారం లేదు. వారిద్దరూ నటులే. శివానీ ప్రస్తుతం వెబ్ మూవీలో నటిస్తుండగా, వంశీ యొక్క ‘రంగమార్తాండ’ చిత్రంలో శివత్మిక కీలక పాత్ర పోషిస్తోంది.

టాలీవుడ్ ప్రముఖులు రాజమౌళి, నాగ బాబు, ఎంఎం కీరవాణి, బండ్ల గణేష్, తమన్నా వంటి వారు ఇంతకుముందు కరోనా కు పాజిటివ్ పరీక్షింపబడి ఆ తరువాత రికవర్ అయ్యారు. జీవిత… రాజశేఖర్ కూడా త్వరగా కోలుకోవాలని మనం కోరుకుందాం.