corona-to-bachchans-2020-more-or-less-done-for--indian-cinemaబాలీవుడ్ ని కరోనా భయం పట్టి పీడిస్తుంది. అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ లకు కరోనా సోకి ముంబైలోని నానావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈలోగానే మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కుటుంబానికి కూడా కరోనా సోకింది.

అనుపమ్ ఖేర్ తల్లీ, ఇతర కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలిందట. అయితే లక్కీగా ఆయనకు మాత్రం నెగటివ్ అని వచ్చింది. ఈ విషయం అనుపమ్ ఖేర్ స్వయంగా ట్విట్టర్ లో తెలిపారు. మరోవైపు… నటి రేఖ ఇంటి సెక్యూరిటీ గార్డ్ కు పాజిటివ్ రావడంతో జాగ్రత్త చర్యలు చెప్పట్టారట.

వరుసగా వస్తున్న ఇటువంటి వార్తలతో బాలీవుడ్ బెంబేలెత్తిపోతోంది. ఈ తరుణంలో షూటింగ్లు మొదలు పెట్టడం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే థియేటర్ల రి-ఓపెనింగ్ కూడా ఆలస్యం కావడం ఖాయం. ఇండస్ట్రీ మీద ఆధారపడిన రోజు వారి కూలీలు మరి కొన్ని నెలలు పస్తులు ఉండకతప్పేలా లేదు.

ఇది ఇలా ఉండగా… నానావతి హాస్పిటల్ లోని ఐసొలేషన్ వార్డులో ఉన్న అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ల పరిస్థితి స్టేబుల్ గా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తాను క్షేమంగా ఉన్నా అని, తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని అమితాబ్ హాస్పిటల్ నుండే విడుదల చేసిన ఒక వీడియోలో తెలిపారు.