Pawan Kalyan Janasena - Communists కడపలో ఉక్కుకర్మాగారం సాధనకు ఈ నెల 29న కడప బంద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కూడళ్లలో ర్యాలీలు, నిరసనలు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. ఉక్కుకర్మాగారంపై కేంద్రాన్ని విమర్శించకపోయినా ఈ బంద్ కు జనసేన కూడా మద్దతు ఇచ్చింది.

నిన్నగాకమొన్న జనసేన కమ్యూనిస్టులు కలిసి పని చేయ్యడానికి మూడునెలల్లో కార్యాచరణ రూపొందిస్తాం అని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. అయినా పవన్ కళ్యాణ్ పై ఎందుకో కమ్యూనిస్టులకు గురి కుదరడం లేనట్టు ఉంది. బహుశా ఏ విషయంలోనూ బీజేపీని విమర్శించకపోవడం వల్ల కావొచ్చు.

కలిసి పని చేస్తాం అని పవన్ కళ్యాణ్ ప్రకటించిన మరునాడే వైకాపాతో జనసేన కలిస్తే తాము ఆ పార్టీతో కొనసాగలేమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టంచేశారు. పైగా కలిసి పని చేస్తాం అని అంటున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల విషయం వచ్చేసరికి 175 స్థానాల్లోనూ పోటీ చేస్తాం అని కూడా చెబుతున్నారు. దీనితో కమ్యూనిస్టులకు ఆయన తమను వాడుకుని వదిలేస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయట.