Daggubati Purandeswariబీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియాలో వస్తున్న టీడీపీ కాంగ్రెస్ పొత్తు ఊహాగానాలపై స్పందించారు. ఎన్టీఆర్‌ కుమార్తెగా ఆ రెండు పార్టీల పొత్తును వ్యతిరేకిస్తున్నను అని ఆవిడ మీడియాకు తెలిపారు. తన తండ్రి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారని అటువంటి పార్టీ కాంగ్రెస్ పంచన చేరితే ఆయన ఆత్మ శోభిస్తుందని ఆవిడ చెప్పుకొచ్చారు.

అయితే పురంధేశ్వరి గతంలో తాను కాంగ్రెస్ లో సంగతి, కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర మంత్రి పదవిని అనుభవించిన సంగతీ మొత్తానికి మర్చిపోయినట్టున్నారు. కాంగ్రెస్ లో ఉంటూ అనునిత్యం తన తండ్రి స్థాపించిన టీడీపీ పతనం కోసమే పని చేసారు ఆమె. ఇప్పుడు బీజేపీలో చేరి అదే పని చేస్తున్నారు.

కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొడుతున్న ఒక్క మాట కూడా మాట్లాడకుండా చివరి నిముషం దాకా పదవిని అంటిపెట్టుకున్న వారు పురంధేశ్వరి. ఎన్టీఆర్ కుమార్తె గా తనకు లేని అంటు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకు మాత్రమే ఉందన్నమాట. ఇప్పుడు రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేస్తున్నా అదే మౌనం. ఆ పార్టీని వెనకేసుకుని వస్తున్న తీరుకి ఎన్టీఆర్ ఆత్మ క్షోభించదా?