ప్రస్తుతం నుండి ‘ప్రజారాజ్యం’ పార్టీ ప్రచారం రోజుల్లోకి వెళితే… తన అన్నయ్యను భుజాన వేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆకాశమే హద్దుగా తీవ్రస్థాయిలో ప్రత్యర్ధులపై మండిపడ్డారు. ఒకానొక స్థాయిలో అయితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశిస్తూ… పంచెలు ఊడదీసి మరీ కొడదాం… అంటూ మండిపడిన తీరు అప్పట్లో సంచలనాత్మకమైంది. అయితే అవే వ్యాఖ్యలను తాజాగా కాంగ్రెస్ నేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ చేసారు.
ఏపీకి హోదా లేదు, ప్యాకేజ్ మాత్రమే అని మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్న నేపధ్యంలో తిరుపతి నుండి ఓ మీడియా ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్న ఓ కాంగ్రెస్ మహిళా నేత స్పందిస్తూ… తిరుపతి వేదికగా ఆనాడు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేసిన ప్రకటనలను అమలు చేయాలని, లేని పక్షంలో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ను గుడ్డలూడదీసి కొడతామని, కాకినాడ సభలో మేమే ఈ పని చేస్తాము ఖబడ్దార్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘ప్రత్యేక హోదా’ ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలేసి పవన్ పై మండిపడడం వలన కలిగే ప్రయోజనం ఏమిటో కాంగ్రెస్ కైనా తెలుసో లేదో గానీ, ఈ వ్యాఖ్యల పట్ల పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఒక మహిళగా వ్యాఖ్యానించాల్సిన మాటలు కాదని, ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తక్షణం క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. బహుశా నాడు వైఎస్ పై పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇపుడు రివేంజ్ తీర్చుకుంటున్నారేమో..!