Chiranjeevi acharyaఅల్లు అర్జున్ అల వైకుంఠపురములో సక్సెస్ తో ఉబ్బితబ్బిపోయాడు. ఆ జోష్ లో సుకుమార్ సినిమా మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నాడు. అయితే ఈ సినిమా ఎందుకనో వాయిదా పడుతూ వస్తుంది. ముందుగా బ్యాంగ్ కాక్ లో షూట్ అనుకున్నారు. ఆ తరువాత కేరళకు మార్చారు. ఇప్పుడు తాజాగా మారేడుమిల్లి అనుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి పెద్దగా లేకపోవడం కలిసొచ్చే విషయం. ఈ నెల 20న మారేడుమిల్లి అడవులలో షూటింగ్ మొదలు పెట్టడానికి నిర్ణయించారు. అయితే ఇప్పుడు అది కూడా వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు. కరోనా వైరస్ వల్ల తమ ఆచార్య షూటింగ్ పదిహేను రోజుల పాటు ఆపేస్తున్నామని చిరంజీవి ప్రకటించారు.

సహజంగా చిరంజీవి లాంటి ఇండస్ట్రీ పెద్ద ప్రకటిస్తే అందరు ఫాలో కావాల్సిందే. పైగా అల్లు అర్జున్ అంటే మెగా ఫ్యామిలీ హీరో. ఈ సమయంలో తాను చిత్రం షూటింగ్ మొదలుపెడితే బాగోదు. దీనితో చిరంజీవి ప్రకటన బన్నీని ఆలోచనలో పాడేసింది. ఒక వర్గం మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని కొంత మేర తేడాగా చూస్తారు.

చిరంజీవిని కాదని షూటింగ్ మొదలుపెడితే వారు రగడ చెయ్యడం ఖాయం. స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో లారీ డ్రైవర్‌ పాత్రలో అల్లు అర్జున్, ఫారెస్ట్‌ అధికారి పాత్రలో విజయ్‌ సేతుపతి, విలన్‌గా జగపతిబాబు నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.