Chiranjeevi - Sai Pallavi - Keerthy Sureshమెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంతో మెహర్ రమేష్ సినిమాకు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ చేస్తున్నారు, ఇది తమిళ బ్లాక్ బస్టర్ వేధలం యొక్క అధికారిక రీమేక్. చిరంజీవి తాను ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ ఆచార్యను పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది. వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో మెగాస్టార్ సోదరి పాత్ర కోసం సాయి పల్లవిని ఖరారు చేసినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ పాత్ర కోసం ఆమె పరిశీలనలో ఉన్న మాట వాస్తవమే అని, కానీ ఇప్పటి వరకు ఏమీ ఖరారు కాలేదని మనకున్న సమాచారం. ఈ పాత్ర సాయి పల్లవి కెరీర్‌కు మంచిదా కాదా అనే దానిపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి.

“మేము త్వరలో సాయి పల్లవి మరియు కీర్తి సురేష్ లతో చర్చలు ప్రారంభిస్తాము. ప్రస్తుతానికి, మేము ఈ పాత్ర కోసం ఎవరినీ లాక్ చేయలేదు” అని జట్టులోని మనకు ఉన్న ఒక సోర్స్ తెలిపింది. ఒరిజినల్‌లో లక్ష్మీ మీనన్ ఈ పాత్ర పోషించింది మరియు ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. దానితో ఈ పాత్ర ఎవరు చేస్తారు అనేదాని మీద సర్వత్రా చర్చ జరుగుతుంది.

యంగ్ మ్యూజిక్ కంపోజర్, మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఖరారు చేయబడ్డారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంగీత సిట్టింగ్‌లు జరుగుతున్నాయి. చిరంజీవి ఆచార్య కోసం మణి శర్మ సంగీతం చేస్తున్నారని మన పాఠకులకు తెలుసు. ఆ రకంగా తండ్రీకొడుకులు ఇద్దరితోనూ చిరంజీవి పని చెయ్యబోతున్నారు.