chiranjeevi remuneration maatv mek show“ఏనుగు చచ్చినా, బ్రతికినా వెయ్యే” అన్నట్లు… మెగాస్టార్ సిల్వర్ స్క్రీన్ మీద ఉన్నా లేకపోయినా ఆ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి ఇస్తున్న పారితోషికం రుజువు చేస్తోంది. వెండితెరకు దూరమై పది సంవత్సరాలు గడుస్తున్నా… మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే సమయానికి బ్యాక్ టు ఫాం అన్నట్లుగా తయారైన మెగాస్టార్ చిరంజీవి, ఈ సారి వెండితెర కంటే ముందే బుల్లితెరపై రంగ ప్రవేశం చేయనున్నారు.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు సందడి చేస్తున్నాయి, మొదటి ప్రశ్నను మెగాస్టార్ ఇప్పటికే వదిలారు కూడా! అభిమానుల్లో, బుల్లితెర వీక్షకులలో తీవ్ర ఆసక్తిని రేపుతోన్న ఈ కార్యక్రమం ఏ మేరకు ఆకట్టుకుంటుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కార్యక్రమ నిర్వహణకు మెగాస్టార్ ఒక్కో ఎపిసోడ్ కు భారీ మొత్తంలో వసూలు చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

బుల్లితెరపై ప్రసారమయ్యే ఒక్కో ఎపిసోడ్ కు గానూ మెగాస్టార్ కు ఏకంగా 10 లక్షల రూపాయలు ముట్టుతున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో గానీ, ఇది గనుక నిజమైతే… మెగాస్టార్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. అయితే ఇంత భారీ మొత్తంలో ఇచ్చినా… ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి రీత్యా… ఈ ప్రోగ్రాం బుల్లితెరపై ఆల్ టైం రికార్డులు సృష్టిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.