చిరంజీవి, రామ్ చరణ్ ఏమిటి అల్లు అర్జున్ దారిలో వెళ్లడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ వేగంగా సాగుతోంది. రామ్ చరణ్ ఈ చిత్రంలో సిద్ధ అనే అతిధి పాత్రలో నటించనున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ లోకి ఎంటర్ అయ్యాడు.
మరోవైపు రామ్ చరణ్, చిరంజీవి కాంబినేషన్ సన్నివేశాలను మారేడుమిల్లి అడవిలో చిత్రీకరించనున్నారు. అల్లు అర్జున్ పుష్ప ప్రస్తుతం అక్కడ చిత్రీకరణ జరుగుతోంది. అదే లొకేషన్ లో ఆచార్య షూటింగ్ కూడా చేయబోతున్నారట. చిరంజీవి, రామ్ చరణ్ ఫిబ్రవరి మొదటి వారంలో రాజమండ్రికి వెళ్లి యూనిట్లో చేరనున్నారు.
ఈ కీలకమైన షెడ్యూల్ ఫిబ్రవరి 7 నుండి ప్రారంభం కానుంది. చిరంజీవి మరియు రామ్ చరణ్ నటించిన కొన్ని కీలక ఎపిసోడ్లు ఈ షెడ్యూల్లో చిత్రీకరించబడతాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డేను హీరోయిన్ గా బృందం ఖరారు చేసిందని సమాచారం. ఈ నటి ఇంతకుముందు రామ్ చరణ్ సరసన చెయ్యలేదు.
ఆచార్య మే నెలలో సమ్మర్ స్పెషల్గా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 29 న విడుదలయ్యే ఫస్ట్ లుక్ టీజర్ డేట్ వెల్లడిస్తారా అనేది చూడాలి. ఈ టీజర్ కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడని కూడా వార్తలు వస్తున్నాయి. దానితో మెగా అభిమానులు చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.