సాహోతో ఫ్లాప్ మూటగట్టుకున్న సుజీత్కు మలయాళం హిట్ చిత్రం లూసిఫెర్ యొక్క తెలుగు రీమేక్లో మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వం వహించే బాధ్యత అప్పగించారు. చిరంజీవి, సుజీత్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనిపై వీడియో కాల్స్ లో బిజీగా ఉన్నారు. చిరంజీవి ఇమేజ్కి, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు.
ఒరిజినల్లో కథానాయకుడికి హీరోయిన్ ఉండదు, కానీ ఇప్పుడు రీమేక్ ప్రాజెక్ట్లో రొమాంటిక్ ట్రాక్ చేరుస్తున్నారట. అంతేకాకుండా, మోహన్ లాల్ సినిమా మొదటి 17 నిమిషాల్లో కనిపించడు. తెలుగులో అది మార్చబోతున్నారు. రొమాంటిక్ ట్రాక్ను జోడించడం వల్ల అసలు సినిమా ఫీలింగ్ చెడిపోతుందా అని చాలా మంది అనుమానిస్తున్నారు.
అయితే రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా మెచ్యూర్డ్ గా ఉండబోతుందని సమాచారం. అందుకు తగ్గట్టే హీరోయిన్ ని కూడా సెలెక్ట్ చేస్తారట. లూసిఫర్ రీమేక్ ఈ సంవత్సరం చివరిలో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో యువి క్రియేషన్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి ఆచార్య షూటింగ్ను పూర్తి చేసి ఈ సినిమా మొదలు పెడతారు. ఒకవేళ ఆచార్య 2021 సంక్రాంతికి వాయిదా పడితే లూసిఫర్ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ రీమేక్ కి సంబంధించిన మిగతా వివరాలు లాక్ డౌన్ తరువాత తెలిసే అవకాశం ఉంది.