Chiranjeevi looking after Sye Raa Narasimha Reddy pre production సైరా న‌ర‌సింహా రెడ్డి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి అయితే చిత్రబృందం ఇప్పటిదాకా దానిని ధృవీకరించలేదు. ఇది ఇలా ఉండగా దర్శ‌కుడు సురేందర్ రెడ్డి, హీరో చిరంజీవి మ‌ధ్య అంతా స‌వ్యంగా లేద‌నే ప్ర‌చారం ఎప్పటినుండో జ‌రుగుతుంది. మొత్తానికి ఎలా అయితే సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. అయితే ఇప్పటికీ చిరంజీవి సురేందర్ రెడ్డిని నమ్మడం లేదని ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతుంది.

దీనితో పోస్టు ప్రొడక్షన్ ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు చిరంజీవి. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సినిమాలో ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేదాని మీద ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారట. సురేందర్ రెడ్డి గ్రాఫిక్స్ పని అప్పగించినా పూర్తయిన పని అంతా చిరంజీవి ఒకే అంటే గానీ పూర్తి అయినట్టు కాదంట. అయితే ఏది ఎలా ఉన్నా మెగా స్టార్ ఇంకో హిట్ కొడితే అదే చాలు అంటున్నారు మెగా అభిమానులు. చారిత్రాత్మక సినిమా చెయ్యడం సురేందర్ రెడ్డికు ఇదే మొదటి సారి.

ఈ సినిమాను దాదాపు 200 కోట్ల‌తో నిర్మిస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. ఆగ‌స్ట్ 22న చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా సైరా టీజ‌ర్ విడుద‌ల కానుందని సమాచారం. ప్రస్తుతం చిరంజీవి ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు. థియేట్రికల్ బిజినెస్ కూడా ప్రారంభమైంది. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న సైరాపై అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి. మరి వీటిని అందుకోగలరా అనేది చూడాల్సి ఉంది.