Chiranjeevi Laucnhes MAA Tvతెలుగు బుల్లితెరపై ప్రముఖ టెలివిజన్ ఛానల్ గా కొనసాగుతున్న ‘మా టీవీ,’ ఇటీవల ‘స్టార్’ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ డీల్ ద్వారా ‘మా టీవీ’లో పెట్టుబడులు పెట్టిన అక్కినేని నాగార్జున, చిరంజీవి, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులకు కోట్ల రూపాయలలో ఆదాయం వచ్చినట్లుగా అప్పట్లో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుండి ‘మా టీవీ’ పేరు మారుతుందని భావించినా, అది కార్యరూపం దాల్చలేదు.

అయితే తాజాగా ‘స్టార్’ హోదాతో ‘మా టీవీ’ లోగో రానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ లోగోను మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా విడుదల చేసారు. ‘స్టార్ మా’ పేరుతో డిజైన్ అయిన కొత్త లోగోను చిరు అట్టహాసంగా రిలీజ్ చేసారు. ‘స్టార్ మా’ లోగోకు ‘అదే బంధం సరికొత్త ఉత్తేజం’ అనే క్యాప్షన్ ను కూడా జోడించారు. సోమవారం నుండి మెగాస్టార్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రసారం కానున్న కార్యక్రమం కొత్త లోగోతో దర్శనమివ్వనుందన్న మాట.