Chiranjeevi-Takes-First-Step-Towards-Lotus-Pond-from-The-Film-Industryమెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల చిత్రం వచ్చే నెలలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి నుండి ఈ సినిమా సంగీత దర్శకుడి విషయంలో సందిగ్ధత నడుస్తోంది. సినిమాకు సంబంధించిన టెక్నిషన్స్ అందరి పేర్లు ప్రకటించినా మ్యూజిక్ డైరెక్టర్ పేరు బయటపెట్టలేదు.

తన ప్రతి సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ చేత మ్యూజిక్ చేయించుకున్న కొరటాల ఈసారి మార్పు కోరుకుంటున్నారట. బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్, అతుల్ పట్ల ఆసక్తిగా ఉన్నారట. అయితే దీనిపై మెగా అభిమానులే పెదవి విరుస్తున్నారు. సైరాకు కూడా ఇద్దరు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. అయితే సైరా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా లేదు.

పైగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మన నేటివిటీ మిస్ అయ్యిందని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఈ తరుణంలో తరువాతి సినిమాకు కూడా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకోవడం వారికి రుచించడం లేదు. ఈ క్రమంలో చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరుకి జోడీగా త్రిష నటించే అవకాశం ఉందని పుకార్లు షికారు చేస్తున్నాయి.

మొన్న ఆ మధ్య ఈ సినిమా నక్సల్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా దేవాదాయ ధర్మాదాయ శాఖ నేపథ్యంలో ఉంటుందని, గుడులు, వాటి నియంత్రణ బోర్డుల పరిపాలన మీద ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల చెయ్యనున్నారని ప్ర‌చారం జ‌రుగుతుంది