గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహ్మద్ ఈరోజు ఉదయం గుండెపోటు తో మరణించారు. నిత్యం మెగా హీరోలతో, అభిమానులతో కలివిడిగా వారే లోకంగా ఉండే నూర్ భాయ్ మరణంతో మెగా హీరోలు, అభిమానులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు రామ్ చరణ్ మొన్న ఆ మధ్య సొంత ఖర్చులతో చికిత్స కూడా చేయించారు.
ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి హటాహుటిన తన అభిమాని ఇంటికి చేరుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచారు. .ఆయన్ని తిరిగి తీసుకొని రాలేను కానీ వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి కుటుంబ సభ్యులును ఓదార్చారు.
చిరంజీవి అక్కడ ఉండగానే అల్లు అర్జున్ అక్కడకి వచ్చారు. మిగతా మెగా హీరోలు కూడా తరలివచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఉందట. నూర్ భాయ్ మృతికి ఆయనకు గౌరవ సూచకంగా గీత ఆర్ట్స్ ఈరోజు ప్రకటించాల్సిన అల వైకుంఠపురములో టీజర్ సమయాన్ని వాయిదా వేసుకుంది.
మెగా అభిమానులు కూడా నూర్ భాయ్ ఇంటికి తరలి వెళ్తున్నారు. ఒక అభిమాని కోసం హీరోలు, అభిమానులు తరలివెళ్లి, వారి కుటుంబానికి అండగా నిలబడటం మంచి పరిణామం. మిర్చి9 కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ఈ నష్టాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తుంది.