Chiranjeevi - Director Meher Ramesh2013 నుండి ఒక్క సినిమా కూడా చెయ్యని మెహర్ రమేష్ కు మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. తమిళ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ వేదళం రీమేక్ ఇది. వేదళం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. చిరంజీవి ఈ సినిమా తన అభిమానులకు, మాస్‌కు నచ్చుతుందని నమ్ముతారు.

గతంలో తనకు ఎన్నో మరపురాని హిట్స్ ఇచ్చిన కెఎస్ రామారావుకు ఈ సినిమా చేసే అవకాశం ఉంది. రామ్ చరణ్ కో-ప్రొడ్యూసర్ గా ఉండవచ్చు. 2013 లో విడుదలైన షాడో తర్వాత మెహర్ రమేష్ ఏ సినిమాకి దర్శకత్వం వహించలేదు. అతను మెగాస్టార్ కుటుంబానికి దగ్గరి బంధువు, ఇది వేదళం రీమేక్ కోసం దర్శకుడిగా చిరంజీవి ఆయనను ఎంచుకోవడానికి కారణం కావచ్చు.

మెహర్ రమేష్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు మెగా అభిమానులకు సుతారం నచ్చలేదు. వారికి చిరంజీవి ఒక రీమేక్ ప్రాజెక్ట్ చెయ్యడం నచ్చలేదు అలాగే మెహర్ రమేష్ లాంటి ప్లాప్ డైరెక్టర్ తో జతకట్టడం అంతకంటే నచ్చలేదు.

చూడాలి చిరంజీవి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. చిరంజీవి ప్రస్తుతానికి కరోనా కేసులు కొంత తగ్గితే తన ఆచార్య సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ కేవలం 40% మాత్రమే కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కావాల్సి ఉండగా… తాజాగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.